telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

రిలయన్స్ జియో దసరా ఆఫర్.. రూ.699కే జియో ఫోన్..!

relianace jeo

ప్రముఖ టెలికాం సంస్థ రిలయన్స్ జియో దసరా పండుగ సందర్భంగా వినియోగదారులకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. జియో ఫోన్‌ను రూ.1500కు బదులుగా కేవలం రూ.699కే కొనుగోలు చేయవచ్చు. అందుకుగాను గతంలో మాదిరిగా ఎలాంటి ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేయాల్సిన పనిలేదు. నేరుగా అదే ధరకు జియో ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.

ఇక ఈ ఫోన్‌ను కొన్న వారికి మొదటి 7 రీచార్జిలపై అదనంగా రూ.99 విలువైన మొబైల్ డేటాను జియో ఉచితంగా అందివ్వనుంది. దీంతో ఫోన్ కొనుగోలుపై రూ.800, 7 రీచార్జిల డేటా విలువ రూ.700 కలిపి మొత్తం రూ.1500 ఆదా చేసుకోవచ్చు. కేవలం దీపావళి పండుగ వరకు మాత్రమే ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని జియో తెలిపింది.

Related posts