telugu navyamedia
రాజకీయ వ్యాపార వార్తలు

ఆస్తులు అమ్ముకుంటున్న.. రిలయన్స్.. ఇదొక్కటే మార్గం

indian rupee falling during budget sessions
ఆర్ కాం (రిలయన్స్ కమ్యూనికేషన్స్) సంస్థ దివాళా తీసినట్టుగా తేలిపోయింది. దానితో సంస్థ అధినేత అనిల్ అంబానీ సదరు ఆస్తులను అమ్మి, అప్పులు తీర్చేందుకు సిద్ధం అయ్యాడు. రిలయన్స్ కామ్ సంస్థ కోసం తీసుకున్న అప్పులు తీర్చలేక తమ ఆస్తులను అమ్మి తద్వారా వచ్చే రూ.42వేల కోట్లు చెల్లించాలని భావిస్తున్నారు. అదికూడా 270 రోజుల్లో చెల్లిస్తానని అనిల్ అంబానీ చెబుతున్నారు. గత ఏడాదినర్రగా చెల్లిస్తానని చెప్పి చెల్లించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
గత ఏడాదినర్రకాలంగా రుణాలు ఇచ్చిన వారికి చిల్లి గవ్వ కూడా చెల్లించలేకపోయినట్లు బోర్డు తెలిపింది. ఇక అప్పులు తీర్చలేమనే నిర్ణయానికి వచ్చేశామని, ఇందుకోసమే ఆస్తులను అమ్మకాలకు పెట్టినట్లు ఆర్‌కాం బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది. అంతేకాదు పలు న్యాయపరమైన చిక్కులు తలెత్తడంతో ఆర్‌కాంకు సంబంధించి రూ.18వేల కోట్లు ఆస్తులను అమ్మలేకపోతోందని ప్రకటనలో తెలిపింది. దీనిపై భారతదేశం విదేశాలకు చెందిన 40కి పైగా రుణదాతల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ ఆస్తులు అమ్మేందుకు వీలుపడలేదని స్పష్టం చేసింది.ఇక రుణాలు ఇచ్చిన బ్యాంకుల్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, చైనా డెవలప్‌మెంట్ బ్యాంక్‌లున్నాయి. యూనియన్ బ్యాంక్, కెనారా బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్, స్టాండర్డ్ ఛాటర్డ్ బ్యాంక్ మరియు హెచ్ఎస్‌బీసీ బ్యాంకులు రుణాలు ఇచ్చిన వాటిలో ఉన్నాయి.
ఆర్‌కామ్ కింద పనిచేసే రెండు సంస్థలు అయిన రిలయన్స్ టెలికాం లిమిటెడ్ మరియు రిలయన్స్ ఇన్ఫ్రాటెల్ లిమిటెడ్ సంస్థలు త్వరలోనే ఓ వేగవంతమైన పరిష్కారం కోసం ముంబైలోని నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించనుంది. కోర్టును ఆశ్రయించడం అందరికీ ఆమోదయోగ్యంగా ఉందని… ఇలా వెళితే కోర్టు ఆదేశాల మేరకు రుణాలు ఇచ్చిన బ్యాంకులకు న్యాయం జరగడమే కాదు పారదర్శకత కూడా ఉంటుందని భావిస్తోంది సంస్థ. అంతేకాదు 270 రోజుల గడువులో చెల్లించేందుకు కూడా తాము సిద్దంగా ఉన్నట్లు వెల్లడించారు.

Related posts