ఉత్తర్ప్రదేశ్ జర్నలిస్టు ప్రశాంత్ కనోజియాను విడుదల చేయండని సుప్రీంకోర్టు యూపీ ప్రభుత్వానికి సూచించింది. ఆయనను ఎందుకు అరెస్టు చేశారని ఈరోజు సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అతనేమైనా మర్డర్ చేశాడా అని అడిగింది. ఫ్రీలాన్స్ జర్నలిస్టు ప్రశాంత్ను రిలీజ్ చేసి యూపీ ప్రభుత్వం పెద్ద మనసును చాటుకోవాలని కోర్టు తన తీర్పులో పేర్కొన్నది.
ప్రశాంత్ కనోజియా భార్య వేసిన పిటిషన్పై ఇవాళ కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. యూపీ సీఎం యోగిని కించపరిచేవిధంగా ఉన్న వీడియోను ప్రసారం చేసిన కేసులో ప్రశాంత్ను అరెస్టు చేశారు. పౌరుల స్వేచ్ఛ పవిత్రమైందని, దాంట్లో రాజీలేదని, రాజ్యాంగమే ఆ గ్యారెంటీ ఇచ్చిందని, దాన్నెవ్వరూ బ్రేక్ చేయలేరని కోర్టు తెలిపింది. ప్రశాంత్ కనోజియాను తక్షణమే రిలీజ్ చేయాలని కోర్టు ఆదేశించింది.