గురువారం ఉదయం అనంతపురం జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూ) లో ఉన్నత విద్యామండలి ఛైర్మన్ కే. హేమచంద్రారెడ్డి, ఈసెట్ ఛైర్మన్ శ్రీనివాసరావు ఫలితాలను విడుదల చేశారు.
అభ్యర్థులు cets.apsche.ap.gov.in వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ నంబర్, హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయడం ద్వారా ఫలితాలను పొందవచ్చని అధికారులు వెల్లడించారు.
ఈ ప్రవేశ పరీక్షను మే 8న రాష్ట్రవ్యాప్తంగా 14 పరీక్షా కేంద్రాలలో నిర్వహించిన విషయం తెలిసిందే.
ఈ పరీక్షకు మొత్తం 36, 369 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఏపీ ఈసెట్ 2024 జవాబు కీని మే 10న విడుదల చేసిన అధికారులు.. ఇవాళ ఉదయం 11 గంటల తర్వాత ఫలితాలను రిలీజ్ చేశారు.