హేమంత్ మధుకర్ దర్శకత్వంలో అనుష్క, మాధవన్ ప్రధాన పాత్రధారులుగా “నిశ్శబ్దం” అనే చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థలు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పోరేషన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర నిర్మాతలు టి.జి.విశ్వప్రసాద్, వివేక్ కూచిభోట్ల, కోన వెంకట్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ్, ఇంగ్లీషు, హిందీతో పాటు మలయాళంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆర్.మాధవన్, అంజలి, మైఖేల్ మ్యాడసన్, షాలినీ పాండే, సుబ్బరాజు, శ్రీనివాస అవసరాల, హంటర్ ఓ హరో కూడా నటిస్తున్నారు. అనుష్క నటిస్తోన్న “నిశ్శబ్ధం” చిత్రాన్ని మిగతా భాషల్లో “సైలెన్స్” పేరుతో విడుదల చేయనున్నారు. అయితే ఏప్రిల్ 2న విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా వైరస్ కారణంగా ఆగింది. థియేటర్స్ ఇంకా ఓపెన్ కాలేదు. దీంతో సినిమాను ఓటీటీలో విడుదల చేయడానికి నిర్ణయించుకున్నారు. ఈ సినిమా వచ్చే నెల అక్టోబర్ 2న ఓటీటీలో విడుదల కానున్నట్లు సమాచారం. అయితే ఇప్పటివరకు ఓటీటీ లో విడుదలైన పెంగ్విన్, వి సినిమాలు అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. మరి ఈ సినిమా ఎంతమేరకు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందో చూడాలి.
previous post
అతన్నే పెళ్ళి చేసుకుంటా… లవ్ ఎఫైర్ పై కియారా కామెంట్స్