telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కూలీలతో కలిసి నాటేసిన ఎమ్మెల్యే రేఖానాయక్

Rekha nayak

తెలంగాణలో గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఖరీఫ్ పనులు ఊపందుకొన్నాయి. ముందే వరినాళ్లను సిద్దం చేసుకొన్న రైతులు వర్షాలు సకాలంలో కురియకపోవడంతో వరినాట్లను ఆలస్యంగా ప్రారంభించారు. ఎట్టకేలకు వరుణుడు కరునిచడంతో భూమిని చదును చేసిన రైతులు వరినాట్లు వేస్తునారు.

చిరుజల్లులను సైతం లెక్కచేయకుండా రైతులు, కూలీలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని దేవునిగూడ పంచాయతీలోని చెర్లపల్లే గ్రామం మీదుగా వెళ్తున్న ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ నాటేస్తున్న పొలం వద్ద ఆగారు. మహిళా కూలీలను పలకరించిన ఎమ్మెల్యే వారితో కలిసి పొలంలోకి దిగి కాసేపు నాటేశారు.

Related posts