షియోమీ తన నూతన స్మార్ట్ఫోన్ రెడ్మీ నోట్ 8ప్రోను తాజాగా భారత్లో విడుదల చేసిన విషయం విదితమే. కాగా ఈ ఫోన్కు చెందిన 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.9,999గా ఉండగా, 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.12,999గా ఉంది. రేపటి నుంచి ఈ ఫోన్ను అమెజాన్, ఎంఐ ఆన్లైన్ స్టోర్లలో ఎక్స్క్లూజివ్గా విక్రయించనున్నారు. ఈ ఫోన్ను కొన్న ఎయిర్టెల్ ప్రీపెయిడ్ వినియోగదారులు రూ.249, రూ.349 రీచార్జిలపై 10 నెలల పాటు డబుల్ డేటాను పొందవచ్చు.
రెడ్మీ నోట్ 8ప్రో స్మార్ట్ఫోన్లో… 6.39 ఇంచుల డిస్ప్లే, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్, ఆక్టాకోర్ స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64/128 జీబీ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 48, 8, 2, 2 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరాలు, 13 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్టీఈ, బ్లూటూత్ 5.0, యూఎస్బీ టైప్ సి, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.. తదితర ఫీచర్లను అందిస్తున్నారు.