బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వర్కింగ్ టైటిల్ “బిబి-3” పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన బీబీ 3 టీజర్కి మాస్ ఆడియన్స్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని ద్వారక క్రియేషన్స్ బ్యానర్పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లాక్ డౌన్, కరోనా కారణంగా వాయిదా పడగా, త్వరలోనే తిరిగి సినిమా షూటింగ్ ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే వారణాసిలో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఈ నెల 15 నుంచి బాలయ్య ఈ సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నారట. ఈ భారీ సినిమాలో హీరోయిన్ గా సాయేషా సైగల్ నటిస్తోంది. ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తున్నారు. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు సూపర్ హిట్ కావటంతో ఈ సినిమాలో భారీ అంచనాలున్నాయి. అయితే ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్గా పూర్ణకు ఓకే చేయగా.. మెయిన్ హీరోయిన్ విషయంలో మాత్రం యూనిట్ చాలా ఇబ్బందులు పడింది. ముందుగా బాలయ్య సరసన నటించేందుకు మలయాళ బ్యూటీ ప్రయాగ మార్టిన్ను ఫైనల్ చేశారు. అయితే ఆమె కొద్దిరోజులకే ఆమెకు తప్పించినట్లు వార్తలొచ్చాయి. ఆమె స్థానంలో సాయేషా సైగల్ను ఓకే చేసినట్లు తాజాగా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇదే విషయాన్ని సాయేషా సోషల్మీడియా ద్వారా నిర్ధారించారు. అయితే ఈ సినిమా నుంచి ప్రయాగ తప్పుకోవడానికి ఏవేవో కారణాలు ప్రచారం జరుగుతున్నాయి. టెస్ట్ షూట్లో బాలయ్య సరసన ఆమె మరీ చిన్నపిల్లలా కనిపించడంతో ప్రాజెక్ట్ నుంచి తప్పించినట్టుగా వార్తలొచ్చాయి. అయితే దీనిపై యూనిట్ క్లారిటీ ఇచ్చింది. బాలయ్య సరసన ప్రయాగ మార్టిన్ లుక్ సెట్ అవ్వని కారణంతో తీసేసినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని, డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ప్రయాగనే స్వయంగా తప్పుకున్నట్లు స్పష్టం చేసింది. దీంతో ఈ విషయంలో వస్తున్న రూమర్లకు యూనిట్ చెక్ పెట్టింది.
previous post