ఎప్పటినుండో ప్రచారంలో ఉన్న వార్త ఇప్పుడు నిజమైంది. అయితే కేజియఫ్ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకున్న తర్వాత ప్రముఖ స్టార్ల దృష్టి దర్శకుడు ప్రశాంత్నీల్పై పడింది. ప్రశాంత్నీల్ చేయబోయే ప్రాజెక్టులో కలిసి వర్క్ చేయాలని టాలీవుడ్ స్టార్లు తహతహలాడుతున్నారు. ఇటీవలే దర్శకుడు ప్రశాంత్ నీల్ ప్రభాస్ను కలిసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచే వారిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా రానుందని అభిమానులు పక్కాగా డిసైడ్ అయ్యారు.ఈ మేరకు కేజీఎఫ్ సినిమా తెరకెక్కించిన హోంబలే ఫిల్మ్స్ సంస్థ ట్విట్టర్లో కెజియఫ్ దర్శకుడు ప్రశాంత్నీల్ తో ప్రభాస్ సినిమాకు సంబందించిన పోస్టర్ ను విడుదల చేసింది. ‘ది మోస్ట్ వాలైంట్ మెన్.. కాల్డ్ వన్ మెన్.. ది మోస్ట్ వాలైంట్’ అంటూ ప్రభాస్ గూర్చి తెలియజేస్తూ “సాలార్” టైటిల్ పోస్టర్ విడుదల చేశారు. ప్యాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్న డార్లింగ్ ప్రభాస్ లుక్ అలరిస్తుంది. ప్యాన్ ఇండియా సినిమాల్లో నటిస్తున్న డార్లింగ్ ప్రభాస్ లుక్ అలరిస్తుంది. పాన్ ఇండియా రేంజ్లో రూపొందే ఈ సినిమాకి అన్ని భాషల్లో సెట్టయ్యేలా పేరును పెట్టారు. ఇది ఉర్దూ పదం కాగా.. టైటిల్కు ధైర్యవంతుడైన నాయకుడు, దారిచూపేవాడని అర్థం. చిత్రీకరణ జనవరిలో ప్రారంభం కానుంది. అటు ప్రభాస్ ప్రస్తుతం రాధేశ్యామ్, ఆదిపురుష్, నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ఓ సినిమా చేస్తున్నాడు.
previous post