ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లే పేద గ్రామీణ విద్యార్థులకు వడ్డీలేని ప్రయాణ ఖర్చును రాజాబహదూర్ వెంకట్రామ్రెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ అందిస్తుందని సొసైటీ కార్యదర్శి మంగళవారం ప్రకటనలో పేర్కొన్నారు. విదేశాల్లో ఉన్నతవిద్యను అభ్యసించాలనే కోరిక ఉన్నా ఆర్థిక స్థోమత అనుకూలించకపోయే పేద గ్రామీణ రైతు కుటంబాలకు చెందిన విద్యార్థులకు ఈ సౌకర్యాన్ని కల్పించడం జరిగిందన్నారు.
ఇదిలా ఉండగా విదేశాలకు వెళ్లేందుకు విద్యార్థులకు ఒక వైపు ప్రయాణ ఖర్చును వడ్డీ లేకుండా అందజేయడం జరుగుతుందన్నారు. కాగా ఈ వడ్డీ లేని రుణాన్ని పొందిన విద్యార్థులు మూడేండ్లలోపు తిరిగి సొసైటీకి చెల్లించాలన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు www. rbvrres.com. ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకొని ఈనెల 28వ తేదీలోగా దరఖాస్తు ఫారాలను పూర్తి చేయాలన్నారు.