మాస్ మహారాజా రవితేజ, డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందుతోన్న మూడో చిత్రం ‘క్రాక్’. ఇదివరకు ఈ ఇద్దరి కలయికలో వచ్చిన ‘డాన్ శీను’, ‘బలుపు’ సినిమాలు విజయాలను అందుకున్నాయి. ఇప్పుడు వీరిద్దరూ హ్యాట్రిక్పై కన్నేశారు. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన కొన్ని యథార్థ ఘటనల ఆధారంగా రూపొందుతోన్న ‘క్రాక్’ మూవీలో శ్రుతి హాసన్ నాయికగా నటిస్తున్నారు. ప్రముఖ తమిళ నటులు సముద్రకని, వరలక్ష్మీ శరత్కుమార్ పవర్ఫుల్ క్యారెక్టర్లు పోషిస్తున్నారు. దేవీ ప్రసాద్, చిరగ్ జాని, మౌర్యని, సుధాకర్ కోమాకుల, వంశీ చాగంటి ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్పై బి. మధు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి ఎస్. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ‘మెర్సల్’, ‘బిగిల్’ వంటి బ్లాక్బస్టర్ సినిమాలకు పనిచేసిన జి.కె. విష్ణు సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా డైలాగులు రాశారు. ఇటీవలే ఫైనల్ షూట్ ను ఫుల్ స్వింగ్ లో స్టార్ట్ చేసిన చిత్ర యూనిట్ ఇప్పుడు ఫైనల్ డే షూట్ కు వచ్చేసింది. అది మాత్రమే కాకుండా ఈ ఫైనల్ రోజు షూట్ ను ప్రముఖ టాలెంటెడ్ నటి వరలక్ష్మీ పై సీన్స్ తో కంప్లీట్ చేసి గుమ్మడికాయ కొట్టేసినట్టుగా చిత్ర దర్శకులు, ఇతర యూనిట్ తెలిపారు. ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ లోనే నిలపనున్నట్టుగా మరోసారి దర్శకుడు క్లారిటీ ఇచ్చారు.
previous post
“అరే పవన్” అంటూ శ్రీరెడ్డి సంచలన వ్యాఖ్యలు