telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

ఆల్ రౌండర్ జడేజా.. జిమ్‌ వీడియో వైరల్

సౌథాంప్టన్ వేదికగా జూన్‌ 18-22 మధ్య జరిగే ప్రపంచ టెస్టు ఛాంపియన్‌ షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌లో భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. అనంతరం ఇంగ్లాండ్‌తో టీమిండియా ఐదు టెస్టులు ఆడనుంది. ఈ పర్యటనలో రాణించేందుకు భారత ఆటగాళ్లు ఇప్పటినుంచే సన్నద్ధమవుతున్నారు. దేహదారుఢ్యం సరిగ్గా ఉంచుకొనేందుకు ఇంట్లో ఏర్పాటు చేసుకున్న జిమ్‌లలో కసరత్తులు చేస్తున్నారు.ఇంగ్లాండ్‌తో జరిగే ఐదు టెస్టులతోపాటు కివీస్‌తో తలపడే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు బీసీసీఐ ప్రకటించిన జట్టులో టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా చోటు దక్కించుకున్నాడు. కీలకమైన ఈ మ్యాచ్‌ల్లో రాణించి టీమిండియాకు విజయాలనందించడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్న జడ్డూ.. బుధవారం నుంచి సన్నద్ధత మొదలెట్టినట్టు ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ప్రకటించాడు. జామ్‌నగర్‌ (గుజరాత్‌)లోని తన నివాసంలో ఉన్న జిమ్‌లోని పరికరాలను మొబైల్‌తో వీడియో తీసి ఇన్‌స్టాలో పోస్టు చేశాడు. రెండు ఫొటోలను సైతం అభిమానులతో పంచుకున్నాడు. ఈ ఫొటోలు, వీడియోకు గంటలోనే లక్ష లైక్‌లు రావడంతోపాటు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

Related posts