మాస్ మహారాజా రవితేజ ప్రొడక్షన్ హౌజ్ను ఏర్పాటుచేస్తున్నారనే వార్త తాజాగా ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఒక బ్యానర్ను ఏర్పాటు చేసి తాను హీరోగానే కాకుండా కొత్త కాన్సెప్ట్లతో వేరే హీరోలతో కూడా సినిమాలు నిర్మించాలని రవితేజ చూస్తున్నారట. ముఖ్యంగా తన ప్రొడక్షన్ హౌజ్ ద్వారా యంగ్ టాలెంట్కు అవకాశం ఇవ్వనున్నరని అంటున్నారు. ఈ వార్తలో నిజమెంతో తెలీదు కానీ.. సోషల్ మీడియాలో ప్రస్తుతం బాగా వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే, రవితేజ ప్రస్తుతం ‘క్రాక్’ సినిమాలో నటిస్తున్నారు. గోపీచంద్ మలినేని దర్శకుడు. ‘డాన్శీను’, ‘బలుపు’ చిత్రాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కుతోన్న హ్యాట్రిక్ మూవీ ఇది. రవితేజ ఈ చిత్రంలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన యథార్థ ఘటనలను ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు దర్శకుడు. శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సరస్వతి ఫిలిమ్ డివిజన్ బ్యానర్పై బి.మధు నిర్మిస్తోన్న ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీత సారథ్యం వహిస్తున్నారు.