telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నా పెంపుడు కుక్క అనుమతిస్తే నిన్ను పెళ్లి చేసుకుంటా…

Rashmika-Mandanna

లాక్‌డౌన్ కారణంగా సినిమాలకు సంబంధించిన షూటింగ్స్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇలాంటి సమయంలో హీరో, హీరోయిన్లు అభిమానులతో సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను పంచుకుంటున్నారు. తాజాగా రష్మిక మందన్న కూడా తన అభిప్రాయాలను ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధాన మిచ్చింది. లాక్‌డౌన్ తర్వాత చేసే మొదటగా చేసే పని ఏమిటంటే.. తన స్నేహితులను వెళ్లి కలుస్తానని చెప్పింది. అంతేకాదు తన దగ్గర ఐదు పెంపుడు కుక్కులున్నాయి. వాటితో పాటు 8 కుక్క పిల్లలు ఉన్నట్టు చెప్పుకొచ్చింది. ఇక ఓ అభిమాని మీకు నితిన్, విజయ్ దేవరకొండలో ఎవరంటే ఇష్టం అనే దానికి సమాధానం దాటవేసింది. అంతేకాదు త్వరలోనే ఓ హిందీ చిత్రంలో నటించబోతున్నట్టు సమాధానమిచ్చింది. నేను ఎంత బిజీగా ఉన్న వర్కౌట్స్ చేయడం మాత్రం మాననని చెప్పుకొచ్చింది. ఇక ఓ అభిమాని మేము మీ సినిమాలను చూస్తున్నట్టే.. మీరు నటించిన సినిమాలను మీరు చూస్తారా అనే దానికి .. ఇంట్లో నాకు బోలేడు పెంపుడు జంతువులున్నాయి. వాటితోనే తనకు సమయం సరిపోతుందన్నారు. ఇక తమిళంలో నటిస్తారా అనే దానికి ఇప్పటికే ఓ సినిమా చేశాను. కానీ లాక్‌డౌన్ కారణంగా విడుదల కాలేదని చెప్పుకొచ్చింది. ఓ అభిమాని ఆ దేవుడు నాకు ఎదురైతే..రష్మికకు భర్త చేయమని కోరుతా అని చెప్పాడు. దానికి రష్మిక అంతేస్థాయిలో తన ఇంట్లో ఉన్న పెంపుడు కుక్కను చూపిస్తూ ముందు దీని అనుమతి తీసుకో అంటూ వార్నింగ్ ఇచ్చింది. ఇక దిల్‌వాలే దుల్హనియా లేజాయింగే సినిమాలో మాదిరి మీతో డేటింగ్ చేయాలనుంది అని ఓ ఫ్యాన్ అడిగిన ప్రశ్నకు నన్ను కాస్త ఆలోచించుకోనివ్వు అంటూ సమాధానమిచ్చింది. ప్రస్తుతం రష్మిక పుష్ప సినిమా కోసం ప్రత్యేకంగా చిత్తూరు యాస నేర్చుకుంటున్నట్టు చెప్పుకొచ్చింది.

Related posts