సూపర్స్టార్ మహేష్ బాబు 26వ సినిమాకు తెర లేచింది. వరుస విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ బాబు ఈ సినిమా చేస్తున్నారు. దిల్ రాజు, అనిల్ సుంకర సంయుక్త నిర్మాణంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు “సరిలేరు నీకెవ్వరూ” అనే టైటిల్ ఫిక్స్ చేశారు. సూపర్స్టార్ కృష్ణ జన్మదినోత్సవం సందర్భంగా ఈ సినిమా షూటింగ్ను ఈ రోజు (శుక్రవారం) ఉదయం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సినిమాలో రష్మికా మందన్నా హీరోయిన్గా నటిస్తోంది. టైటిల్ విడుదల చేసిన సందర్భంగా ఈ సినిమా గురించి రష్మిక ట్వీట్ చేసింది. “ఈ విషయం గురించి చాలా మంది అడుగుతున్నారు. అవును.. నేనొక అద్భుతమైన బృందంలో భాగస్వామినయ్యాను. సూపర్ కిక్ వచ్చింది. మహేశ్బాబు, అనిల్ రావిపూడి, దిల్రాజు, అనిల్ సుంకర, దేవిశ్రీ ప్రసాద్ లాంటి వ్యక్తులతో పనిచేసే అవకాశం రావడం చాలా ఆనందాన్ని కలిగిస్తోంది” రష్మిక ట్వీట్ చేసింది.
previous post