telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రచ్చ చేస్తున్న రశ్మిక

కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా తో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న సినిమాలో రష్మిక హీరోయిన్ గా ఎంపిక చేసారు. తెలుగుచిత్ర సీమలో హిట్ సినిమాతో అరంగేట్రం చేసి వరుస విజయాలు అందుకుంది. తనదైన నటనతో అందరిని అలరించి లక్కీ బ్యూటీ బిరుదును సంపాదించింది. అయితే ఈ అమ్మడు బాలీవుడ్‌లోకి అరంగేట్రం ఇస్తోంది.  అక్కడ మొదటి చిత్రం మొదలే కాలేదు… అప్పుడే తరువాతి చిత్రాల చర్చలతో హడావిడి చేసేస్తోంది! రశ్మిక… ఈ పేరు ఇప్పటికే కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో పాప్యులర్. మరీ ముఖ్యంగా, మన టాలీవుడ్ లో మిస్ మందణ్ణ టాప్ స్టార్ గా కొనసాగుతోంది. అయితే, క్రమంగా బెంగుళూరు బ్యూటీ చూపు ముంబై పడుతోంది. ఇప్పటికే పాప్ సింగర్ బాద్షాతో ఓ వీడియో సాంగ్ లో ఆడిపాడింది. నెక్ట్స్ సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా రూపొందే ‘మిషన్ మంజు’ మూవీలో హీరోయిన్ గా నటించబోతోంది. రశ్మిక బాలీవుడ్ డెబ్యూ మూవీకి శంతను బాగ్చీ డైరెక్టర్… రశ్మిక తొలి బాలీవుడ్ చిత్రం ‘మిషన్ మంజు’. అది ఇంకా సెట్స్ మీదకి కూడా వెళ్లలేదు. కానీ, అప్పుడే ‘భీష్మ’ బ్యూటీ బాలీవుడ్ క్రేజ్ సూపర్బ్ గా ఉందట! పలు హిందీ చిత్రాల్లో ఆమె నటించబోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆసక్తికరమైన ప్రాజెక్ట్స్ చర్చల దశలో ఉన్నాయంటున్నారు. అంతే కాదు, రశ్మిక ముంబైలో ఓ ఖరీదైన ఇల్లు కూడా కొనేసింది. చూడబోతే, బబ్లీ బ్యూటీ బాలీవుడ్ ని సీరియస్ గానే టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది.

Related posts