telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సీరియల్‌ నటిగా ఎంట్రీ ఇవ్వనున్న రాశీఖన్నా !

రాశీఖ‌న్నా తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల‌లో న‌టిస్తూ బిజీగానే ఉంది. 2014లో వ‌చ్చిన ఊహ‌లు గుస‌గుస‌లాడే అనే చిత్రంలో క‌థానాయికగా న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచుకున్న రాశీ ఖ‌న్నా ఇటీవ‌ల విడుద‌లైన‌ జై ల‌వ‌కుశ‌,ట‌చ్ చేసి చూడు , తొలి ప్రేమ చిత్రాల‌తో ఆక‌ట్టుకుంది. ఇక తమిళంలోను తన హ‌వా చూపిస్తున్న రాశీ ఖ‌న్నా.. అధర్వకు జోడీగా ‘ఇమైకా నొడిగల్‌’ అనే చిత్రం చేసింది. ఈ చిత్రంతో త‌మిళ తెర‌కి ప‌రిచ‌యం అయింది. ఆ త‌ర్వాత జయం రవికి జోడీగా ‘అడంగామరు’, విశాల్‌కి జోడీగా అయోగ్య అనే చిత్రాల‌లో న‌టించింది. ఇది ఇలా ఉండగా.. ప్రతీ రోజూ పండగే మూవీ తర్వాత రాశీఖన్నా కోసం క్రేజీ రోల్‌ ఒకటి మారుతి డిజైన్‌ చేశారట. పక్కా కమర్షియల్‌ మూవీలో టీవీ సీరియల్‌ నటిగా కనిపించనుందని టాక్‌ వినిపిస్తోంది. ఫన్నీ క్యారెక్టరైజేషన్‌తో రాశీఖన్నా రోల్‌ సాగుతుందట. అయితే దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. 

Related posts