telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సాయిధరమ్‌తేజ్ తో రొమాన్స్‌ చేయనున్న రాశిఖన్నా..!

రాశీఖ‌న్నా తెలుగు, త‌మిళం, మ‌ల‌యాళ భాష‌ల‌లో న‌టిస్తూ బిజీగానే ఉంది. 2014లో వ‌చ్చిన ఊహ‌లు గుస‌గుస‌లాడే అనే చిత్రంలో క‌థానాయికగా న‌టించి తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సు దోచుకున్న రాశీ ఖ‌న్నా ఇటీవ‌ల విడుద‌లైన‌ జై ల‌వ‌కుశ‌,ట‌చ్ చేసి చూడు , తొలి ప్రేమ చిత్రాల‌తో ఆక‌ట్టుకుంది. ఇక తమిళంలోను తన హ‌వా చూపిస్తున్న రాశీ ఖ‌న్నా.. అధర్వకు జోడీగా ‘ఇమైకా నొడిగల్‌’ అనే చిత్రం చేసింది. ఈ చిత్రంతో త‌మిళ తెర‌కి ప‌రిచ‌యం అయింది. ఆ త‌ర్వాత జయం రవికి జోడీగా ‘అడంగామరు’, విశాల్‌కి జోడీగా అయోగ్య అనే చిత్రాల‌లో న‌టించింది. ప్ర‌స్తుతం సిద్ధార్థ్‌ హీరోగా తెరకెక్కిన‌ ‘సైతాన్‌ కా బచ్చా’, “సంగ తమీజన్” , క‌డాసి విడాసై అనే త‌మిళ‌ చిత్రంలో నటిస్తున్నారు. అయితే.. తాజాగా ఈ భామకు మరో బంపర్‌ ఆఫర్‌ వచ్చిందట. మెగాహీరో సాయిధరమ్‌ తేజ్‌, దర్శకుడు సుకుమార్‌ కాంబోలో ఓ సినిమా నిర్మిస్తున్నారు. సుకుమార్‌ శిష్యుడు ఈ సినిమాకు దర్శకుడు. సరికొత్త జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయితేజ్‌ సరసన రాశీఖన్నా హీరోయిన్‌గా ఎంపికైనట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కబోతుందట. కాగా.. మెగా హీరో సాయితేజ్‌, రాశీ ఖన్నా కాంబోలో సుప్రీం, ప్రతిరోజూ పండగే సినిమాలు సూపర్‌ హిట్లుగా నిలిచిన సంగతి తెలిసిందే.  

Related posts