telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఈవెంటుకి లేట్ గా వచ్చి అందరి కాళ్ళు పట్టుకున్న స్టార్ హీరో…

ranveer

ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రోహిత్ శెట్టి తెరకెక్కించిన ‘సూర్యవంశీ’ ట్రైలర్‌ను నిన్న గ్రాండ్‌గా రిలీజ్ చేసారు. ఇందులో అక్షయ్ కుమార్, కత్రినా కైఫ్ జంటగా నటించారు. అజయ్ దేవగణ్, రణ్వీర్ అతిథి పాత్రలు పోషించారు. అయితే ట్రైలర్ లాంచ్ చేసే సమయానికి అక్షయ్, అజయ్, కత్రినా, రోహిత్ టైంకి వచ్చేసారు. కానీ రణ్వీర్ మాత్రం అంతా అయిపోయాక లేట్‌గా వచ్చాడు. దాంతో అతనిపై అంతా కామెంట్స్ చేసారు. సారీ సారీ అంటూ రణ్వీర్ గుంజీళ్లు తీసాడు. అంతేకాదు అక్కడున్నవారి కాళ్లు పట్టుకుని హంగామా చేసాడు. ఆ సమయంలో తీసిన వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇంతకీ రణ్వీర్ లేట్‌గా ఎందుకు వచ్చాడో తెలుసా.. అతని భార్య దీపిక పదుకొణె వల్లేనట. దీపిక వేరే ప్రదేశానికి వెళ్లిందట. అందుకే లేట్ అయిందని అన్నాడు. ఇందుకు దీపిక ఇన్‌స్టాగ్రామ్ ద్వారా స్పందించారు. ‘నేను ఎక్కడున్నా కూడా ఈవెంట్‌కి టైంకి వెళ్లిపోతాను. నీలాగా లేట్‌గా వెళ్లను’ అని సరదాగా కామెంట్ చేసింది.

Related posts