హైదరాబాద్లో జరిగిన దారుణ సంఘటన దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. వెటర్నరీ డాక్టర్ను నలుగురు దుర్మార్గులు దారుణంగా రేప్ చేసి తరువాత సజీవ దహనం చేశారు. దీంతో ఒక్కసారిగా ప్రజల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. ఇలాంటి దారుణాలు ఇక మీదట జరగకుండా గట్టి చర్చలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్రజలు రోడ్డెక్కారు. ఈ దారుణానికి పాల్పడ్డ రాక్షసులను వెంటనే ఉరి తీయాలని డిమాండ్ చేశారు. అయితే తాజాగా పోలీస్ ఎన్కౌంటర్ లో నిందితులు చావడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. కాగా.. సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం నిందితులు ఆరిఫ్, జొల్లు శివ, జొల్లు నవీన్, చెన్నకేశవులును చటాన్పల్లికి వ్యాన్లో తీసుకెళ్లగా వారు పోలీసులపై రాళ్లు రువ్వి పారిపోయేందుకు యత్నించారు. దీంతో పోలీసులు కాల్పులు జరపగా నిందితులు అక్కడికక్కడే మృతి చెందారు. దిశ నిందితుల ఎన్కౌంటర్పై సామాన్య ప్రజానీకం నుంచి సెలబ్రిటీలు అంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. దిశకు సరైన న్యాయం జరిగిందంటూ ప్రతి ఒక్కరూ వ్యాఖ్యానిస్తున్నారు. టాలీవుడ్ సినీ ప్రముఖులే కాకుండా బాలీవుడ్ ప్రముఖులు సైతం ఈ ఎన్కౌంటర్పై ట్విట్టర్ వేదికగా స్పందిస్తున్నారు. దిశ దశదిన కర్మ రోజునే ఆ నరరూప రాక్షసులు కూడా హతమయ్యారు. ఈ సందర్భంగా దిశ చనిపోయిన ఘటనలోనే ఓ గుడి కట్టాలని అభిప్రాయపడ్డారు బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సోదరి రంగోలీ చందేల్. “ఈరోజు నా హృదయం గర్వంతో పొంగిపోతోంది. ఇదే న్యూ ఇండియా. రాక్షసుల ఇళ్లల్లోకి దూసుకెళ్లడమే కాదు చంపిపారేస్తాం. సౌత్ ఇండియాలో నటీనటుల కోసం అభిమానులు గుడి కడతారని విన్నాను. మీకో విన్నపం చేయాలనుకుంటున్నాను. దిశను ఎక్కడైతే దారుణంగా రేప్ చేసి కాల్చి చంపారో అదే చోట ఆమెకు గుడి కట్టండి. అమ్మవారి అవయవాల వివిధ ప్రదేశాల్లో పడిపోతే అక్కడ గుళ్లు కట్టినట్లు దిశకు కూడా గుడి కట్టి అంతే పవిత్రంగా ఆరాధించండి. దిశ తల్లిదండ్రులు సమాజంలో ఎలా తలెత్తుకుని తిరగాలని సిగ్గుపడకూడదు. వారికి చిన్న కూతురు ఉంది. ప్రియాంకకు తగిన గౌరవం ఇవ్వకపోతే ఆమె చెల్లెలి జీవితం ఎప్పటికీ సాధారణంగా ఉండదు. దయచేసి దీని గురించి హైదరాబాద్ వాసులు ఆలోచించాలని కోరుకుంటున్నాను” అని అన్నారు రంగోలి.
previous post
next post