తాజాగా ప్రముఖ బాలీవుడ్ లిరిసిస్ట్ జావేద్ అక్తర్ మోదీని ఫేసిస్ట్ అన్నారు. ఆయన వ్యాఖ్యలపై కంగనా సోదరి స్పందించారు. ఆయన అన్న మాటలను ఓ వెబ్సైట్ ప్రచురించింది. ఈ ఆర్టికల్ను ఓ నెటిజన్ ట్విటర్లో పోస్ట్ చేస్తూ రంగోలీని ట్యాగ్ చేసారు. దీనిపై రంగోలీ స్పందిస్తూ.. ‘జావేద్ అక్తర్ గారు ఓ సారి నా చెల్లి కంగనకు ఫోన్ చేసి హృతిక్ రోషన్కి, మహేష్ భట్కి సారీ చెప్పాలని లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని బెదిరించాడు. మహేష్ సినిమాలో కంగన సూసైడ్ బాంబర్ పాత్రలో నటించలేదని ఆమెపై చెప్పు విసిరాడు. ఈ విషయం కంగన మీడియా ముందు చెప్పిందని జావేద్ బెదిరించాడు. ఇప్పుడు చెప్పండి జావేద్ గారూ ఎవరు ఫేసిస్ట్ ఇక్కడ’’ అని ఇరికించారు. రంగోలీ చాందేల్ ప్రధాని నరేంద్ర మోదీ భక్తురాలు. బీజేపీకి సపోర్ట్ చేస్తారు. ఇక కంగనాను ఎవరు ఏ మాట అన్నా కూడా ఊరుకోరు. అది ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా వదలరు.
previous post