బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్, చాకోలెట్ బాయ్ రణ్బీర్ కపూర్ ల ప్రేమాయణం గురించి తెలిసిందే. అయితే ఈ జంట త్వరలోనే పెళ్ళి చేసుకోబోతున్నారంటూ గత కొంతకాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీపికా పదుకొనే, కత్రినా కైఫ్ వంటి హీరోయిన్లతో ప్రేమాయణాలు సాగించిన బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణ్బీర్ కపూర్ ప్రస్తుతం ఆలియా భట్తో డేటింగ్ చేస్తున్నాడు. వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వీరి పెళ్లికి ఇరు కుటుంబాల పెద్దలు అంగీకరించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ పెళ్లిపై రణ్బీర్ సోదరి, హీరోయిన్ కరీనా కపూర్ స్పందించింది. మామీ అవార్డుల వేడుకలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆలియా, కరీనాను కరణ్ జోహార్ ఇంటర్వ్యూ చేశారు. ఇందులో భాగంగా “కరీనాకు మరదలు అవుతానని ఎప్పుడైనా భావించావా?” అంటూ ఆలియాను కరణ్ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు కరీనా స్పందిస్తూ.. “రణ్బీర్, ఆలియా వివాహం చేసుకుంటే ఈ ప్రపంచంలో మొదట సంతోషించే వ్యక్తిని నేనే” అంటూ జవాబిచ్చింది. అనంతరం ఆలియా మాట్లాడుతూ.. “రణ్బీర్తో పెళ్లి గురించి ఇప్పటివరకు నేనేం ఆలోచించలేదు. ప్రస్తుతం ఆలోచించాలనుకోవడం కూడా లేదు” అంటూ సమాధానం ఇచ్చింది.