పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే పవన్ “పింక్” తెలుగు రీమేక్ “వకీల్ సాబ్”, క్రిష్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నారు. తాజాగా మరో మలయాళ రీమేక్ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించనుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. మలయాళంలో బిజు మీనన్ నటించిన పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్నారు. ఇక పృథ్వీరాజ్ పాత్రకు గానూ పలువురి పేర్లు వినిపించాయి. అందులో రానా, నితిన్, సాయి ధరమ్ తేజ్ ఉన్నారు. వీరిలో ఎవరో ఒకరు ఫైనల్ అవుతారని టాక్ నడిచింది. ఇదిలా ఉంటే ఈ రీమేక్పై రానా స్పందించారు. ఇందులో ఓ పాత్ర కోసం తనను సంప్రదించిన మాట నిజమేనని ఆయన అన్నారు. అయితే ఇంకా ఏదీ ఫైనల్ అవ్వలేదని, ఇందులో నటించాలని తనకు ఆసక్తిగా ఉందని తెలిపారు. మరి ఈ మూవీ కోసం రానా ఫైనల్ అవ్వనున్నారా..? లేదా..? అన్నది తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.
previous post