telugu navyamedia
రాజకీయ వార్తలు

ఢిల్లీకి బయలుదేరిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌

Ramnath president

శీతాకాలంలో భారత రాష్ట్రపతి హైదరాబాదులో కొన్ని రోజుల పాటు విడిది చేయడం తెలిసిందే. ఈ ఏడాది కూడా రాష్ట్రపతి శీతాకాల విడిది కోసం ఈ నెల 20వ తేదీన రాష్ట్రపతి కోవింద్‌ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వచ్చారు. నిన్న సాయంత్రం తన నివాసంలో ఎట్ హోం కార్యక్రమం నిర్వహించిన రామ్ నాథ్ కోవింద్ శీతాకాల విడిదిని ముగించుకున్నారు.

ఈ రోజు ఉదయం ఆయన హకీంపేట ఎయిర్‌ఫోర్స్‌ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరారు. రామ్‌నాథ్‌ కోవింద్‌కు రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌, మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభ స్పీకర్‌, మంత్రులు, మేయర్‌ బొంతు రామ్మోహన్‌లు వీడ్కోలు పలికారు.

Related posts