రామ్చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించిన చిత్రం ఆర్ ఆర్ ఆర్. దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మార్చి 25 న విడుదలకు సిద్ధంగా ఉంది. నేపథ్యంలో చిక్ బళ్ల పూర్ లో ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్ గా నిర్వహించారు.
కర్ణాటకలోని చిక్బళ్లాపుర్ వేదికగా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ.. మా కుటుంబ సభ్యుడు.. పెద్దన్నయ్య పునీత్ రాజ్ కుమార్ గారు మన మధ్య లేడంటే నమ్మాలని లేదు..నమ్మను కూడా. ఆయన ఇక్కడే ఉంటూ మనల్ని ఆశీర్వాదిస్తుంటాడు.. ఆయన లేని లోటు శివన్న ద్వారా తీర్చుకుంటాం. ఆయన ఎక్కడ ఉన్నా మమ్మల్ని ఆశీర్వదిస్తారు.
ఇక్కడికి వచ్చిన ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, నా మిత్రుడు ఆరోగ్య శాఖ మంత్రి సుధాకర్కు ధన్యవాదాలు. ఇక్కడ ఎంతో సేపటి నుంచి మా కోసం ఓపికగా ఎదురుచూస్తున్నా నా అభిమానులకు, తారక్ అభిమానులకు ధన్యవాదాలు. . మీరు లేనిదే మేము లేము.. నిజంగా తారక్ కు, నాకు మీరు ఒక నీడలా మా వెంట ఉంటున్నారు. మీకోసం ఆఖరికి మార్చి 25 న మేము పడిన కష్టం, శ్రమ సినిమాలో చూస్తారు.
ఇంత పెద్ద సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో ‘మీకు ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి’ అని అడుగుతున్నారు. నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు. ఇక్కడ ఉన్నందుకు సంతోషంగా ఉంది. ఏపీ, తెలంగాణ తర్వాత కర్ణాటక మాకు పెద్ద మార్కెట్. రాజమౌళి ఫ్యాబ్రిక్ వర్క్ చూడడానికి మీ అందరు థియేటర్ కి రావాలి. రాజమౌళి టీమ్ అందరికి ధన్యవాదాలు” అంటూ చెప్పుకొచ్చారు చరణ్..
అందరూ సినిమాను థియేటర్లకు వెళ్లే చూస్తారా? అని అభిమానులను ఫన్నీగా ప్రశ్నించారు. ఆ తర్వాత రాజమౌళి వైపు తిరిగి ‘సార్… అంతేగా… ఇంకెవరూ లేరుగా.’ అని కామెడీగా అడగటంతో స్టేజ్పై ఉన్న వారందరూ నవ్వారు. ఆ తర్వాత మైక్ను తారక్కు అందించారు
Ram & Bheem take the stage 🔥🌊#RRRPreReleaseEvent LIVE – https://t.co/m62TdhMvDe#RRRMovie #RRRMovieOnMarch25th pic.twitter.com/e3KaaOQzSD
— RRR Movie (@RRRMovie) March 19, 2022
డ్రోన్ కెమెరాలంటే చంద్రబాబుకు ఎందుకు భయం: ఎమ్మెల్యే రోజా