జమ్ము కశ్మీర్లోని రాంబన్ జిల్లాలో శనివారం ఉదయం నుంచి జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్ విజయవంతమైంది. ఉగ్రవాదులు ఓ ఇంట్లో నక్కి ఇద్దరు వ్యక్తులను బందీగా చేసుకున్నారు. ఐదు గంటల సుదీర్ఘ ఎదురు కాల్పుల అనంతరం ముగ్గురు ఉగ్రవాదులను జవాన్లు హతమార్చినట్లు జమ్ము ప్రాంత లెఫ్టినెంట్ కల్నల్ దేవేంద్ర ఆనంద్ తెలిపారు. కాగా ఉగ్రవాదుల కాల్పుల్లో ఒక జవాను మృతిచెందగా మరో ఇద్దరు జవాన్లు గాయపడ్డట్లు వెల్లడించారు. ఉగ్రవాదుల చెర నుంచి ఇద్దరు పౌరులను రక్షించినట్లు తెలిపారు. ఘటనాస్ధలంలో భారీ ఎత్తున ఆయుధ సామాగ్రిని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి.
విభజన వల్ల రాజధానిని నష్టపోయాం: మంత్రి ధర్మాన