ఎనర్జిటిక్ హీరో రామ్, డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన “ఇస్మార్ట్ శంకర్” గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. “ఇస్మార్ట్ శంకర్” చిత్రంలో రామ్ సరసన నభా నటేష్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించగా మణిశర్మ సంగీతం అందించాడు. ఈ చిత్రం ఫస్ట్ షో నుంచే మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుంటూ తొలి రోజే ఊహించని కలెక్షన్స్ సాధించింది ఈ చిత్రం. ఇప్పటికీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపిస్తుంది. రామ్ పోతినేని, నిధి అగర్వాల్, నభా నటేశ్ ప్రధాన పాత్రలలో తెరకెక్కిన ఈ చిత్రం జూలై 18న గ్రాండ్గా విడుదలైంది. పూరి జగన్నాథ్ స్టైల్ లో సాగే సైంటిఫిక్ మర్డర్ మిస్టరీ చిత్రం కాగా, మెమోరీ ట్రాన్స్ఫర్ అనే కొత్త అంశాన్ని టచ్ చేస్తూ ఈ చిత్రాన్ని హైదరాబాదీ బ్యాక్డ్రాప్లో తెరకెక్కించారు. చాలా రోజుల తర్వాత ఇటు పూరీకి ఇటు రామ్ ఖాతాలో “ఇస్మార్ట్ శంకర్”తో హిట్ పడింది. అయితే `ఇస్మార్ట్శంకర్` సినిమాలో హీరో క్యారెక్టర్ చాలా చెడుగా ఉందని, దాని వల్ల సమాజంపై చెడు ప్రభావం పడుతుందని కొందరు నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విమర్శలకు రామ్ తాజాగా సమాధానం చెప్పాడు. “హీరో హెల్మెట్ పెట్టుకోలేదు.. హీరో పొగ తాగుతున్నాడు.. హీరో అమ్మాయిలకు గౌరవం ఇవ్వట్లేదు.. ఎంతసేపూ ఇవేగాని.. అక్కడ హీరో అడ్డమొచ్చిన వాళ్లందర్నీ చంపేస్తున్నాడు.. అని ఒక్కరు కూడా ఫిర్యాదు చేయడం లేదు. జీవితానికి విలువ లేదు. చాలా బాధాకరం. గిది సినిమారా భయ్.. సీన్ చూడండి.. సీన్ చేయకండి” అని ట్వీట్ చేశాడు.
previous post