కరోనా మహమ్మారిని నివారించడానికై దేశవ్యాప్త లాక్డౌన్ కొనసాగిస్తున్నాయి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. లిక్కర్, వైన్ షాప్స్ విషయంలో చాలా కఠినమైన రూల్స్ తీసుకొచ్చారు. తాజాగా రామ్గోపాల్ వర్మ మందు షాపులు తెరవాలని కోరుతూ ట్వీట్స్ చేశారు. మద్యం అందుబాటులో లేకపోతే బ్లాక్ మార్కెట్ పెరిగి ప్రజల ఆర్ధిక అవసరాలకు నష్టం చేకూరుతుందని వర్మ అభిప్రాయపడ్డారు. ప్రజలు కోరుకునే దాన్ని ఇలా పరిమితం చేయడం వల్ల బ్లాక్ మార్కెట్లో ధరలు పెంచి అమ్మే అవకాశం ఉంటుంది. దీనివల్ల తమకు అవసరమైన ఆల్కహాల్ను చాలా ఎక్కువ మొత్తం చెల్లించి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ కారణంగా వారి కుటుంబాలు ఇతర అవసరాలను కోల్పోయే అవకాశం ఉంది అని వర్మ పేర్కొన్నారు. ఆల్కహాల్ దొరకకపోవడం కారణంగా కొందరిలో పెరిగిపోతున్న ఫ్రస్టేషన్ స్థాయి గురించి నాయకులు ఆలోచన చేయాల్సిన అవసరం ఉందని వర్మ తెలపడం విశేషం. ఆల్కహాల్కి కరోనాకు సంబంధం లేదని పేర్కొంటూ మందు బాబులకు సపోర్ట్ చేసే ట్వీట్స్ చేశారు వర్మ. గత కొన్నిరోజుల క్రితమే తెలంగాణ సీఎం కేసీఆర్కి విస్కీ ఛాలెంజ్ విసిరిన ఆయన ఇప్పుడు మందు ప్రియులకు మద్దతు తెలిపి విస్కీ వీరుడని ప్రూవ్ చేసుకున్నారు. వర్మకు ట్వీట్పై రియాక్ట్ అవుతూ కరెక్ట్గా చెప్పారంటూ బదులిస్తున్నారు నెటిజన్లు. ప్రస్తుతం ఈ తీయిట్ వైరల్ అవుతోంది.
Leaders shud give some thought to the frustration levels caused by lack of alcohol which many need to sail through this depression .unbelievable anger is building up causing domestic fights and anger against administration because there’s no corelation with alcohol and corona
— Ram Gopal Varma (@RGVzoomin) April 26, 2020