బిగ్ బాస్-5 మొదలై అప్పుడే సెకండ్ వీక్ ఎండింగ్కు చేరింది. వీకెండ్ కావడంతో హోస్ట్ నాగార్జున రెండ్రోజుల పాటు సందడి చేయనుండగా దీనికి సంబదించిన ప్రోమో కూడా రిలీజ్ చేశారు. ఈ ప్రోమోలో అందరికి షాక్ ఇస్తూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రత్యక్షమయ్యాడు. ఈ మధ్యే డిస్నీ హాట్ స్టార్ కి చరణ్ బ్రాండ్ అంబాసిడర్గా ఎంపికయ్యాడు. ఈ క్రమంలో బిగ్ బాస్ హౌస్ కి తొలిసారి డ్యాషింగ్ ఎంట్రీ ఇచ్చాడు చరణ్.
హౌస్ లో రామ్ చరణ్ ని చూసిన ఇంటి సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ‘ఈజ్ ద మిస్టర్ తీస్మార్ఖాన్ రచ్చ’ అనే సాంగ్ పై చరణ్ స్మాషింగ్ ఎంట్రీ ఇవ్వగా.. ఇంటి సభ్యులందరు లేచి చరణ్ కి వెల్కమ్ చెప్పారు. ఇక హౌస్ లోని ప్రతి కంటెస్టెంట్ గురించి చరణ్ కి నాగార్జున పరిచయం చేశాడు.
ఇకపోతే .. పవర్ స్టార్ రామ్చరణ్ ని చూసిన ఇంటిసభ్యులు తెగ సర్ప్రైజ్ అయ్యారు. వారికి తెలీకుండానే లేచి నిలబడి తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. వీరి ఎగ్జయిట్మెంట్ చూసిన నాగ్.. వీకెండ్లో తను వచ్చినప్పుడు ఎప్పుడూ ఇలా లేచి నిలబడలేదని గుర్తు చేస్తూ చెర్రీ వచ్చినప్పుడు మాత్రం అందరూ లేచి నిలబడ్డ విషయాన్ని గుర్తుపెట్టుకుంటాను అని గుర్రుగా చూశాడు. తాను లోబోలాగా రెడీ అయి వచ్చాననడంతో అతడు సంతోషంతో నేలపై మోకరిల్లి నమస్కరించాడు.
షణ్ముఖ్.. దొరికిందే చాన్స్ అని చెర్రీకి ఐ లవ్ యూ చెప్పాడు. ఇంతలో నాగ్ మధ్యలో అడ్డుకుంటూ ఈ రోజు షణ్నూ నీకు చెప్పాడు, కానీ రోజూ దీప్తికి చెప్తాడని కౌంటరేశాడు. ఆ తర్వాత హమీదా గురించి మాట్లాడుతూ.. హమీదాను ప్రేమించడానికి శ్రీరామ్ ప్రయత్నిస్తున్నాడని, కానీ ఆమె మాత్రం ఇప్పటివరకు ఎస్ చెప్పలేదని నాగ్ అనడంతో చెర్రీ అవాక్కయ్యాడు. మొత్తానికి ప్రోమోలో చెర్రీ ఎక్స్ప్రెషన్స్ హైలైట్గా నిలిచాయి. మామూలుగా శని, ఆదివారాల్లో బిగ్బాస్ షో లో హౌజ్ మేట్స్ ను హోస్ట్ నాగార్జున సెట్ చేస్తుంటారు. ఈ సారి ఇంటి సభ్యుల్లో కొంతమంది అదుపు తప్పుతున్నారని.. కంట్రోల్ ఉండాలని హెచ్చరించాడు .