telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఐదేళ్ల తరువాత విడుదలకు సిద్ధమవుతున్న రకుల్ సినిమా

Rakul-PReeth-Singh

టాలీవుడ్ లో వరుసగా స్టార్ హీరోయిన్ల సరసన అవకాశాలు కొట్టేస్తూ స్టార్ హీరోయిన్ల రేసులో కొనసాగుతోంది పంజాబీ ముద్దుగుమ్మ రకుల్ ప్రీత్ సింగ్. తెలుగు, త‌మిళ, హిందీ భాష‌ల్లో వ‌రుస‌గా సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉంది రకుల్. సినీ రంగంలోకి ప్ర‌వేశించి ద‌శాబ్దం కావొస్తున్నా ఇప్ప‌టికీ అదే గ్లామ‌ర్‌ను మెయింటైన్ చేస్తూ అవ‌కాశాలు అందుకుంటోంది. ఇటీవ‌ల మ‌న్మ‌థుడు 2, దేవ్‌, ఎన్జీకే, దేదే ప్యారేదే, మ‌ర్జావ‌న్ చిత్రాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు రాగా ఇందులో కొన్ని చిత్రాలు ప్రేక్ష‌కుల‌ని నిరాశ‌ప‌ర‌చాయి. కొన్ని మంచి విజ‌యం సాధించాయి. అయితే 2019 కాస్త మిక్స్‌డ్ రిజ‌ల్ట్స్‌తో అసంతృప్తిని క‌న‌బ‌ర‌చగా, 2020లో మంచి విజ‌యాల‌తో దూసుకెళ్ళాల‌ని ర‌కుల్ భావిస్తుంది. ఈ క్ర‌మంలో జ‌న‌వ‌రి 3న “షిమ్లా మిర్చి” అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది ర‌కుల్‌. 2015లోనే ఈ చిత్ర షూటింగ్ పూర్తైన‌ప్ప‌టికీ, ఫైనాన్షియ‌ల్ స‌మ‌స్య‌ల వ‌ల‌న ఇన్నాళ్ళు విడుద‌ల‌కి నోచుకోలేదు. రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రంలో రాజ్‌కుమార్ రావు, హేమ‌మాలిని ముఖ్య పాత్ర‌లు పోషించారు. ర‌మేష్ సిప్పి ద‌ర్శ‌క‌త్వంలో షిమ్లా మిర్చి తెర‌కెక్కింది. మ‌రి ఈ చిత్రం ర‌కుల్‌కి ఎలాంటి విజ‌యం అందిస్తుందో చూడాలి.

Related posts