సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా “భీష్మా” సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నితిన్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మహతి సాగర్ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మరోవైపు చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు నితిన్. చంద్రశేఖర్ ఏలేటి, నితిన్ కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రంలో నితిన్తో రకుల్ జోడి కడుతుందని కొన్నాళ్ళుగా వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో రకుల్ కథానాయికగా నటించడం వాస్తవమే అని అంటున్నారు. ఆమె క్రిమినల్ లాయర్ పాత్రలో కనిపించనుందని చెబుతున్నారు. అతి త్వరలోనే ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. 2017లో వచ్చిన స్పైడర్ తర్వాత రకుల్ ఏ తెలుగు సినిమా చేయలేదు . మధ్యలో కథానాయకుడు చిత్రంలో గెస్ట్ రోల్ పోషించింది. మరో రెండు రోజులలో మన్మథుడు 2 చిత్రంతో ప్రేక్షకులని పలకరించనుంది. వీటితో పాటు తనతో “ఛల్ మోహన్ రంగ” సినిమాను తెరకెక్కించిన కృష్ణ చైతన్య దర్శకత్వంలోను సినిమా చేయనున్నాడు. సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ మూవీ బ్యానర్పై నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు. 2020 సమ్మర్లో ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్ట్కి “పవర్ పేట” అనే టైటిల్ని ఫిక్స్ చేసినట్టు టాక్.
next post
ప్రముఖ వెబ్ సైట్ కు సందీప్ కిషన్ కౌంటర్