కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించడంతో ప్రజలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. అత్యవసరమైతేనో నిత్యావసరాలకోసమో తప్ప ఎవరూ బయటకి రావడంలేదు. సెలబ్రిటీలు తమ రోజువారీ పనులతో సోషల్ మీడియా ద్వారా అప్డేట్లు ఇస్తున్నారు. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ టీ షర్ట్ చాలెంజ్ను తీసుకొచ్చింది. తలకిందులుగా నిల్చుని.. టీషర్ట్ వేసుకుంటూ, మీరూ ట్రై చేయండంటూ తన ఇన్స్టాగ్రామ్లో వీడియో పోస్ట్ చేసింది. రెగ్యులర్గా టీషర్ట్ తొడుక్కోవడం బోర్గా ఉందని చెబుతూ క్యాప్షన్ పెట్టింది. తన ట్రైనర్ అనుష్క పర్వాని, రియా చక్రవర్తి, బాలీవుడ్ నటి ఆకాంక్ష రంజన్ కపూర్ తదితరులకు చాలెంజ్ విసిరింది శనివారం ఉదయం రకుల్ ఈ వీడియో షేర్ చేయగా కొద్ది గంటలకే 11 లక్షలకు పైగా వ్యూస్ రావడం విశేషం.
previous post
next post
10 గంటల వ్యవధిలో చిత్రీకరణ పూర్తి ..