ఈ మధ్యకాలంలో టాలీవుడ్లో రకుల్ ప్రీత్ సింగ్ జోరు తగ్గింది. అందుకు కారణం ‘మన్మథుడు 2’ ఫ్లాప్ అవడమేనని టాలీవుడ్ టాక్.టాలీవుడ్లో టాప్ హీరోయిన్గా ఎదిగిన రకుల్కు ప్రస్తుతం పెద్దగా అవకాశాలు లేవు. దీంతో కోలీవుడ్, బాలీవుడ్ వైపు దృష్టి సారించింది. తెలుగులో తనకు అవకాశాలు తగ్గిపోవడం గురించి తాజాగా ఓ ఇంటర్వ్యూలో రకుల్ మాట్లాడింది. నేను వరుసగా గ్లామరస్ పాత్రలే చేశాను. అది ఎంత తప్పో ఇప్పుడు అర్థమవుతోంది. ఈ కారణం వల్లే నాకు ప్రస్తుతం అవకాశాలు తగ్గిపోయాయి. అంతే తప్ప నాకు ఎవరితోనూ విభేదాలు లేవు. సినిమాకు నేనెప్పుడూ భారంగా మారలేదు. చెప్పిన సమయానికే షూటింగ్కు హాజరయ్యేదాన్ని. నటనకు ప్రాధాన్యం ఇవ్వకుండా అందాల ఆరబోతకే ప్రాముఖ్యం ఇవ్వడం నేను చేసిన తప్పు ని రకుల్ వ్యాఖ్యానించింది.
previous post
next post