పాకిస్థాన్ కు భారత రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. దివంగత ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి తొలి వర్ధంతి సందర్భంగా పోఖ్రాన్ లో రాజ్ నాథ్ నివాళి అర్పించారు.అనంతరం ఓ సైనిక కార్యక్రమంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. సరిహద్దుల్లో పాకిస్థాన్ సైన్యం కాల్పులకు తెగబడుతున్న నేపథ్యంలో ఆయన హెచ్చరికలు జారీ చేశారు.
అణ్వాయుధాలను తొలుత ప్రయోగించకూడదనేది భారత్ సిద్ధాంతమని, సరిహద్దుల్లో పరిస్థితులను బట్టి తమ పాలసీ మారే అవకాశం ఉందని తెలిపారు. భారత్ ను న్యూక్లియర్ పవర్ చేయాలనేది తమ ప్రాధాన్యతాంశమని అన్నారు. ఇదే సమయంలో అణ్వాయుధాలను తొలుత ప్రయోగించకూడదనే సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు.
బాబు ఫ్రంట్ జపంచేస్తే ఏపీలో టెంటే కూలిపోయింది: కిషన్ రెడ్డి