telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

లడఖ్ లో … రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ … పర్యటన..

Rajnath Singh inaugurates NIA office

రేపు లడఖ్ లో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పర్యటించనున్నారు. జమ్మూకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసిన తర్వాత రాజ్‌నాథ్ సింగ్ తొలిసారి లడఖ్ లో పర్యటిస్తున్నారు. తన పర్యటనలో భాగంగా లడఖ్ ను కేంద్ర పాలిత ప్రాంతంగా మారుస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయం వల్ల కలిగే ప్రయోజనాల గురించి రాజ్ నాథ్ అక్కడి ప్రజలు, వివిధ సంస్థల భాగస్వాములతో చర్చించనున్నారు.

పర్యటనలో భాగంగా చైనా, పాక్ సరిహద్దుల్లో తాజా పరిస్థితిపై అక్కడి రక్షణ, సైనిక అధికారులతో రాజ్‌నాథ్ చర్చిస్తారు. చైనా సరిహద్దు వెంబడి ఉన్న తూర్పు లడఖ్ ప్రాంతం, పాక్ సరిహద్దును పంచుకుంటున్న కార్గిల్-ద్రాస్-సియాచిన్ సెక్టార్లలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులపై రక్షణ శాఖ సిబ్బంది, మిలటరీ దళాలతో సమీక్షించనున్నారు.

Related posts