telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సగానికి తగ్గిన సూపర్ స్టార్ రెమ్యూనరేషన్… “దర్భార్” ఎఫెక్ట్

Rajinikanth

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం సిరుతై శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. మీనా, ఖుష్బూ, నయనతార, ప్రకాష్ రాజ్, కీర్తి సురేష్, సూరి తదితరులు ప్రధాన పాత్రధారులు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ నిర్మిస్తోంది. తాజాగా నిర్మాత కళానిధి మారన్, రజనీని షూటింగ్ స్పాట్‌లో కలిసి, తను నిర్మించిన ‘దర్బార్’ చిత్రం మిగిల్చిన భారీ నష్టాల గురించి వివరించి ప్రస్తుతం చేస్తున్న సినిమాకు పారితోషికం తగ్గించుకోవాల్సిందిగా కోరారట. దీనికి రజనీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ‘దర్బార్’ మూవీకి రజనీకాంత్ రూ.116 కోట్లు (GSTతో కలిపి) తీసుకున్నారు. ప్రస్తుతం నటిస్తున్న సినిమాకు సగం అంటే రూ.58 కోట్లు (GSTతో కలిపి) మాత్రమే అందుకోనున్నారు. నిర్మాత శ్రేయస్సు కోరుతూ సూపర్ స్టార్ తీసుకున్న నిర్ణయానికి తలైవా అభిమానులు ఆయణ్ణి అభినందిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ ఏ.ఆర్. మురుగదాస్ దర్శకత్వంలో నటించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘దర్బార్’ జనవరి 9న తమిళ్, తెలుగులో భారీగా విడుదలైంది. టాక్, రికార్డ్ కలెక్షన్స్ మాట పక్కన పెడితే తమిళనాట ఈ సినిమా కొన్న డిస్ట్రిబ్యూటర్లు దాదాపు రూ.70 కోట్ల మేర నష్ట పోయారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.250 కోట్లు వసూలు చేసందని లెక్కలు చెప్పారు కానీ డిస్ట్రిబ్యూటర్లు మాత్రం భారీ నష్టాలతో రోడ్డెక్కారు. తాజాగా ‘దర్బార్’ దెబ్బతో రజనీ తన పారితోషికాన్ని సగానికి తగ్గించారనే వార్తపై కోలీవుడ్‌లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

Related posts