telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

‘కబాలి’ దర్శకుడికి పుత్రోత్సాహం

ranjith

రజినీకాంత్ హీరోగా వచ్చిన ‘కబాలి’, ‘కాలా’ సినిమాలకు పా రంజిత్ దర్శకుడు. ఈ రెండు సినిమాల్లోనూ పేదలు, తనను నమ్ముకున్న వారి కోసం పోరాడే నాయకుడి పాత్రల్లో రజినీ కనిపించారు. ఈ సినిమాలు తన పొలిటికల్ ఎంట్రీకి కూడా బాగా పనికొస్తాయని భావించే రజినీ ఈ సినిమాలు చేశారనే టాక్ కూడా ఉంది. ఇదిలా ఉంటే, పా రంజిత్ ఇప్పుడు పుత్రోత్సాహంలో ఉన్నారు. రంజిత్ భార్య అనిత పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చారు. ఇప్పటికే ఈ దంపతులకు ఆడపిల్ల ఉంది. తమ కుమారుడికి రంజిత్ దంపతులు మిలిరన్ అని నామకరణం చేసినట్టు తెలిసింది. రంజిత్, ఆయన కుమార్తె బాబును ఎత్తుకుని మురిసిపోతున్న ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. రంజిత్ రెండోసారి తండ్రైన సందర్భంగా సీనియర్ నటి ఖుష్బూ ఆయనికి ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. దీనికి రంజిత్ స్పందిస్తూ ఖుష్బూకి థ్యాంక్స్ చెప్పారు.

Related posts