దర్శకుడు శివతో సినిమాకు రజనీకాంత్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. రజనీ ప్రస్తుతం ‘దర్బార్’ సినిమా పనుల్లో ఉన్నారు. ఎ.ఆర్. మురుగదాస్ దర్శకుడు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. నయనతార కథానాయిక. ఈ సినిమా షెడ్యూల్ కోసం గత కొన్ని రోజులు రజనీ ముంబయిలో ఉన్నారు. తన పాత్ర చిత్రీకరణ పూర్తి చేసుకుని అక్టోబరు 4న చెన్నై చేరుకున్నారు. ఈ సినిమా గురించి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సినిమా చక్కగా రూపొందుతోంది. నా పాత్ర షూటింగ్ పూర్తి చేసుకున్నానని అన్నారు.
కాగా రజనీ తన ఇంటికి వెళ్లిన తర్వాత శివ ఆయన్ను కలిసినట్లు తెలిసింది. దాదాపు నాలుగు గంటలు రజనీ నివాసంలోనే ఉన్నారని, కథను నరేట్ చేశారని చెబుతున్నారు. నటించేందుకు రజనీ కూడా దాదాపు సమ్మతించారని సమాచారం. ఈ మేరకు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజం ఎంతో తెలియాలంటే శివ స్పందించాల్సిందే. నిజానికి గతంలోనే తలైవాకు శివ కథ నరేట్ చేశారు. కానీ అది ఆయనకు పూర్తిగా నచ్చలేదట. కొన్ని మార్పులు చేయమని సూచించారు. ఈ మేరకు స్క్రిప్టు మార్చిన శివ ఇప్పుడు మళ్లీ వినిపించినట్లు తెలిసింది.
ఏడుకొండలు మినహా అంతటా వైసీపీ రంగులే: పవన్ కళ్యాణ్