telugu navyamedia
సినిమా వార్తలు

దాదాసాహెబ్ అవార్డు అతనికే అంకితం..

ఈరోజు భారతీయ సినిమా రంగంలోనే అత్యంత ప్రతిష్టాత్మక మైన దాదాసాహెబ్ అవార్డును రజనీకాంత్ ఉపరాష్ట్రపతి ఎమ్ .వెంకయ్య నాయుడు ద్వారా స్వీకరించారు. న్యూ ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో సోమవారం ఉదయం జాతీయ సినిమా అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. భారతీయ సినిమా రంగానికి తన వంతు కృషి చేసిన తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కు దాదాసాహెబ్ అవార్డును ప్రకటించారు . ఈ అవార్డును రజనీకాంత్ స్వీకరించారు.

Watch: Rajinikanth Receives Dadasaheb Phalke Award - Rajinikanth

ఈ సందర్భగా రజనీకాంత్ మాట్లాడుతూ .. తాను బెంగుళూరు లో బస్సు కండక్టర్ గా వున్నప్పుడు , తన సహోద్యోగి , బస్సు డ్రైవర్ తనని సినిమాల్లో ప్రయత్నించమని సలహా ఇచ్చి ప్రోత్సహించాడని, అతని వల్లనే తానూ సినిమా రంగంలో ప్రవేశించానని, అందుకే ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ అవార్డును అతనికి అంకితం చేస్తున్నానని ప్రకటించారు. సినిమా రంగంలో మొదట “అపూర్వ రాగంగాళ్ “లో అవకాశం ఇచ్చిన దర్శకుడు కె .బాలచందర్, తన నిర్మాతలు, దర్శకులు , అభిమానులకు కూడా ఏఈ అవార్డు ను అంకితం చేస్తున్నట్టు రజనీకాంత్ తెలిపారు.

అవార్డుల ప్రదానోత్సవం అనంతరం భారత రాష్ట్రపతి రామనాథ్ కోవిందును రజనీకాంత్ మర్యాదపూర్వకంగా కలిశారు..ఇద్దరు కాసేపు ఆత్మీయంగా మాట్లాడుకున్నారు..

Related posts