ఈ రోజు ఐపీఎల్ 2020 లో రెండో మ్యాచ్ కోల్కత నైట్ రైడర్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య జరుగుతుంది. అయితే ఇందులో టాస్ గెలిచి ఫిల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్ కోల్కత కు మొదట షాక్ ఇచ్చింది. మొదటి ఓవర్ రెండో బంతికే ఓపెనర్ నితీష్ రానా పెవిలియన్ కు చేరుకున్నాడు. కానీ రాహుల్ త్రిపాఠి(39), శుభమన్ గిల్(36) ఇన్నింగ్స్ చక్కదిద్దరు. ఇక వారు ఔట్ అయిన తర్వాత కోల్కత కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 35 బంతుల్లో 68 పరుగులు చేయడంతో కేకేఆర్ నిర్ణిత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. ఇక రాయల్స్ బౌలర్లలో రాహుల్ తెవాటియా 3 వికెట్లు, కార్తీక్ త్యాగి 2, శ్రేయస్ గోపాల్, జోఫ్రా ఆర్చర్ ఒక్కో వికెట్ తీసుకున్నారు. అయితే ఈ రెండు జట్లకు ప్లే ఆఫ్ చేరుకోవడానికి ఇది చాలా కీలకమైన మ్యాచ్. ఇందులో ఏ జట్టు విజయం సాధిస్తుందో… ఆ జట్టుకే ప్లే ఆఫ్ వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అయితే ప్రస్తుతం రాయల్స్ బాట్స్మెన్ మంచి ఫామ్ లో ఉన్నారు. కాబట్టి వారు ఈ 192 పరుగుల లక్ష్యాన్ని చేధించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి . మరి ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అనేది చూడాలి.
previous post
next post
అమరావతి రైతులు రోడ్డెక్కడానికి చంద్రబాబే కారణం: మంత్రి కన్నబాబు