ప్రస్తుతం మన దేశంలో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తుంది. సామాన్యుల నుంచి సెలెబ్రిటీలు, రాజకీయ నాయకుల వరకు కరోనా బారిన పడుతున్నారు. ముఖ్యంగా పబ్లిక్ సెక్టార్ రంగంలో ఉన్న వారికీ కరోనా అధికంగా సోకుతున్నది. దేశంలో అనేక మంది రాజకీయ నాయకులకు కరోనా సోకింది. ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రులు సైతం కరోనా బారిన పడుతున్నారు. ఇటీవలే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా బారిన పడి కోలుకున్నారు. తాజాగా దేశంలో మరో సీఎం కు కరోనా సోకింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రమైన రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. బుధవారం రోజున ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ సతీమణి కరోనా బారిన పడ్డారు. అనంతరం ముఖ్యమంత్రి కూడా కరోనా టెస్టులు చేయించుకున్నారు. ఈ టెస్టుల్లో ఆయనకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ జరిగింది. తనకు ఎలాంటి లక్షణాలు లేకున్నా వైద్యుల సలహా మేరకు హోమ్ క్వారంటైన్ లో ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. చుడాలిమరి ఇంకా ఏం జరుగుతుంది అనేది.
previous post
next post
వైఎస్సార్ సీపీ ప్రజల కోసమే పుట్టింది: విజయమ్మ