telugu navyamedia
రాజకీయ వార్తలు

రెబల్ ఎమ్మెల్యేలకు బీజేపీ 15 కోట్ల ఆఫర్ : అశోక్ గెహ్లాట్

Ashok gehalot rajasthan

రాజస్థాన్ లో వచ్చే నెల 14 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో రాజస్థాన్ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. తాజా పరిస్థితులపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ బీజేపీపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేలకు బీజేపీ భారీ నజరాన ప్రకటించిదనిఅన్నారు. ఇప్పటి వరకు ఒక్కో ఎమ్మెల్యేకు తొలి విడతగా రూ. 10 కోట్లు అడ్వాన్స్‌గా ఇచ్చారని, రెండో విడతగా రూ. 15 కోట్లు ఇస్తామన్నారని ఆరోపించారు.

బీఎస్పీ చీఫ్ మాయావతిపైనా గెహ్లాట్ మండిపడ్డారు. కాంగ్రెస్‌లో ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేల విలీనంపై హైకోర్టులో మాయావతి సవాలు చేయడాన్ని ప్రస్తావిస్తూ.. ఆమె బీజేపీకి వంత పాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఎస్పీ రిట్ పిటిషన్‌పై నిన్న స్పందించిన హైకోర్టు ఆగస్టు 11 లోగా స్పందించాలని ఆదేశించింది. ఈ మేరకు అసెంబ్లీ స్పీకర్‌ సీపీ జోషి, శాసన సభ కార్యదర్శి, బీఎస్పీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఆరుగురు ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది.

Related posts