telugu navyamedia
సినిమా వార్తలు

ఎమోషనల్ థ్రిల్లర్‌ కు రాజశేఖర్ గ్రీన్ సిగ్నల్

Rajasekhar

సరికొత్త తరహా కథాంశంతో ఎమోషనల్ థ్రిల్లర్‌గా రూపొందనున్న ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్. ఈ సినిమాలో సత్యరాజ్, నాజర్, బ్రహ్మానందం కీలక పాత్రలు పోషించనున్నారు. క్రియేటివ్ ఎంటర్‌టైనర్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్ అధినేత డా. జి. ధనుంజయన్ నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘కిల్లర్’ సినిమాకు సంగీతాన్ని అందించిన సైమన్. కె. కింగ్.. డా. రాజశేఖర్ సినిమాకు మ్యూజిక్ అందించబోతున్నారు. తెలుగు ‘క్షణం’ను శిబిరాజ్‌తో ‘సత్య’గా తీయటంతో పాటు ‘బేతాళుడు’ సినిమాకు దర్శకత్వం వహించిన ప్రదీప్ కృష్ణమూర్తి ఈ సినిమాకు మెగాఫోన్ పట్టనున్నారు. హీరోయిన్‌తో పాటు మిగిలిన పాత్రధారులు, సాంకేతిక నిపుణులను త్వరలో ఎంపిక చేయనున్నారు. సినిమా టైటిల్ నిర్ణయించి త్వరలో షూటింగ్ మొదలు పెడతామని నిర్మాత జి. ధనుంజయన్ చెబుతున్నారు. ఆయన మాట్లాడుతూ.. సింగిల్ షెడ్యూల్‌లో షూటింగ్ పూర్తి చేసి మార్చి 2020లో సినిమాను విడుదల చేస్తాము. సింగిల్ సిట్టింగ్‌లో కథను ఓకే చేసి వెంటనే షూటింగ్ మొదలు పెడదామన్న డా. రాజశేఖర్‌కు ఈ సందర్భంగా కృతజ్ఞతలు.. అన్నారు. తమిళంలో రెండు సార్లు జాతీయ అవార్డ్ గెలుచుకున్న నిర్మాత డా. జి. ధనుంజయన్.. సమంత అక్కినేని నటించిన ‘యు టర్న్’ సినిమాతో పాటు విజయ్ ఆంటోని ‘కొలైకారన్’ను తమిళంలో విడుదల చేశారు. అలాగే ఇటీవల మురళీ కార్తీక్, గౌతమ్ కార్తీక్, రెజీనాతో తిరు దర్శకత్వంలో ‘మిస్టర్ చంద్రమౌళి’ సినిమాతో పాటు.. జ్యోతిక, లక్ష్మీ మంచుతో రాధామోహన్ దర్శకత్వంలో ‘కాట్రిన్ మొళి’ సినిమాను ఆయన నిర్మించారు. తాజాగా విజయ్ ఆంటోనీతో రెండు వరుస చిత్రాలను నిర్మిస్తున్నారు ధనుంజయన్. ఇప్పుడు రాజశేఖర్‌తో చేస్తున్న చిత్రంతో తెలుగు చిత్రరంగంలోకి అడుగు పెడుతున్నారు.

Related posts