telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రాజమౌళి-మహేష్‌ మూవీకి స్టోరీ రెడీ ?

ప్రస్తుతం సర్కారు వారిపాట సినిమాలో నటిస్తున్నాడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాకు పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. అంతేకాకుండా జాతీయ అవార్డు గ్రహిత కీర్తీ సురేష్ ఇందులో హీరోయిన్‌గా కనిపించనుంది.  ఇది ఇలా ఉంటే… మహేష్ బాబు తన తర్వాతి సినిమాను రాజమౌళి తో చేయనున్నాడు.  జక్కన్న దర్శకత్వంలో మహేష్ చేస్తే ఆ సినిమా రేంజ్ వేరే లెవెల్లో ఉంటుందని ఊహాగానాలు ఉన్నాయి. అయితే వీరి కాంబోలో సినిమా తప్పక వస్తుందని ఇదివరకే ప్రకటించారు. జక్కన్నతో సినిమా చేయాలని మహేష్ ఎంతో కాలంగా అనుకుంటున్నారంట. అంతే జక్కన్న కూడా మహేష్‌కు సరైన కథ కోసం ప్రయత్నిస్తున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఎట్టకేలకు వీరి కాంబోకు తగ్గ కథ ఫిక్స్ అయిందని, లాక్‌డౌన్‌లోనే ఈ సినిమా స్క్రిప్ట్ కూడా పూర్తయిందని ప్రకటించారు. ఇక సినిమాను పట్టాలెక్కించడమే తరువాయి. అయితే ఈ సినిమాను దాదాపు రూ.200 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో మహేష్‌ను హాలీవుడ్ రేంజ్‌లో చూపించనున్నారంట. ఈ సినిమాతో రాజమౌళి ఎప్పుడు టచ్ కూడా చేయని స్పై థ్రిల్లర్‌ను చేయనున్నారని టాక్ నడుస్తుంది. మరి ఇది ఎంతమేరా నిజమనేది తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమాను పూర్తి బడ్జెట్‌తో నిర్మించడానికి కేఎల్ నారాయణ సిద్దంగా ఉన్నారు. మరి ఈ సినిమా ఇంకెప్పుడు పట్టాలెక్కుతుందో వేచి చూడాలి.

Related posts