telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సినిమా వార్తలు

రాజమౌళి మెచ్చిన.. మత్తు వదలరా చిత్రం..

Rajamouli

రాజమౌళి-కీరవాణి ల కుటుంబ సభ్యులు అందరూ సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నారు. రాజమౌళి ప్రతీ సినిమాకి ఈ కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. వారే లేకపోతే నా సినిమాలు ఇలా ఉండేవి కావని రాజమౌళి కూడా చాలా సార్లు చెప్పాడు. అయితే ప్రస్తుతం కీరవాణి కొడుకులైన కాలభైరవ, శ్రీ సింహా లు కాలభైరవ సంగీతం అందించగా, శ్రీ సింహా నటించిన “మత్తు వదలరా” చిత్రం ఈ నెల డిసెంబర్ 25 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్ విడుదలయి ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంది. సినిమా చాలా కొత్తగా ఉందని టైలర్ ని చూస్తే అర్థం అయింది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ హైదరాబాద్ లో జరిగింది. ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్ న్ కి హాజరైన రాజమౌళి సినిమా గురించి మాట్లాడారు.

ఈ సినిమా దర్శకుడు రితేష్‌ రానా సొంతగా టీమ్ అంతా ఫామ్ చేసుకుని, నిర్మాతకు నమ్మకం కలిగించి ఈ చిత్ర దర్శకత్వ అవకాశాన్ని సంపాందించాడు. రితేష్ ఐడియా నాకు బాగా నచ్చింది అన్నారు ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. కొత్తగా దర్శకత్వం చేయాలనుకునే వారికి ఈ సినిమా మంచి ఉదాహరణ అని చెప్పారు. ఇక సినిమా గురించి మాట్లాడుతూ, తాను సినిమా చూశానని, చూస్తున్నంతసేపూ సినిమా తనకి చాలా నచ్చిందని, ప్రతీ ఫ్రేము చాలా కొత్తగా ఉందని, సినిమా ఆద్యంతం బాగా ఎంజాయ్ చేశానని ప్రేక్షకులు కూడా సినిమాని బాగా ఎంజాయ్ చేస్తారని, ఖచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులకి నచ్చుతుందని అన్నారు. క్రిస్మస్ కానుకగా ఈ సినిమా డిసెంబరు 25 వ తేదీన ప్రేక్షకుల ముందుకి వస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ మరియు క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Related posts