ఏపీలో కరోనా వైరస్ విజృంభించడంతో రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే ఆయా శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు కోవిడ్ భారీన పడగా తాజాగా రాజమండ్రి సెంట్రల్ జైలులో 10 మంది ఖైదీలకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. దీంతో వారిని జైలు అధికారులు కోవిడ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు.
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తోంది. ఇతర రాష్ట్రాల్లో కొత్త కేసులు తగ్గుతుంటే ఏపీలో మాత్రం కేసులతో పాటు మరణాలు కూడా పెరిగిపోతున్నాయి. ఒక్కరోజే 10,128 మంది కరోనా బారిన పడగా, మరణాలు సైతం రికార్డు స్థాయిలో నమోదయ్యాయి. 24 గంటల వ్యవధిలో ఏకంగా 77మంది కరోనాతో మృతిచెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కేసుల సంఖ్య 1,86,461కు చేరింది.