టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ‘ప్రేమతో మీ కార్తీక్’ సినిమాతో పరిచయమైన కార్తికేయ తర్వాత అజయ్ భూపతి దర్శకత్వంలో వచ్చిన ‘RX100’ మూవీతో ఓవర్ నైట్ పాపులర్ అయ్యాడు. ఈ సినిమా హిట్ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు.
కార్తికేయ తాజా చిత్రం ‘రాజా విక్రమార్క’. యాక్షన్ ఎంటర్టైన్గా తెరకెక్కిన ఈ మూవీకి శ్రీ సరిపల్లి దర్శకత్వ వహించారు. ఇందులో తన్యా రవిచంద్రన్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో కార్తికేయ ఎన్ఐఏ ఏజెంట్ గా కనిపించబోతున్నారు.. కొత్తగా అపాయింట్ అయిన కార్తికేయ ఓ సీక్రెట్ మిషన్లో అనుకొకుండా నిందితుడిని కాల్చి చంపుతాడు.
కాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. చిన్నప్పుడు సూపర్ స్టార్ కృష్ణ పెద్దయ్యటామ్ క్రూజ్ చిత్రాలను చూసి ఇన్స్పైర్ అయి అలాంటి జాబ్లో జాయిన్ అయిపోయా కానీ.. సరదా తీరిపోతోంది. ఇంక నావల్ల కాదు’ అంటూ హీరో చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది.
తనికెళ్ల భరణితో కార్తికేయ సన్నివేశాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఏక్ లడ్ కీ భీగీ భాగీ సీ’ అంటూ కిషోర్ కుమార్ సాంగ్తో ఈ టీజర్ను ఓపెన్ చేసారు. తనికెళ్ల భరణి ,సాయి కుమార్లు కీలక పాత్రలు పోషించారు. ప్రశాంత్ ఆర్ విహారి ఈ చిత్రానికి సంగీతం అందించారు.