నేడు ప్రపంచకప్లో భాగంగా పాక్ తో న్యూజిలాండ్ తలపడనుంది. అయితే ఈ మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించింది. కనీసం అంపైర్లు టాస్ వేయలేని విధంగా వర్షం అడ్డంకిగా మారింది. అంపైర్లు పిచ్ను పరిశీలించి నిర్ణయం తీసుకుంటారు.
పాయింట్ల పట్టికలో న్యూజిలాండ్ 11 పాయింట్లతో రెండో స్థానంలో ఉండగా, పాక్ ఐదు పాయింట్లతో ఏడో స్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్ పాక్కు ఎంతో కీలకంగా మారింది. సెమీస్ అశలను సజీవంగా ఉంచుకోవాలంటే ఆ జట్టు ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలిచి తీరాలి. మ్యాచ్ రద్దయితే చెరొక పాయింట్ కేటాయిస్తారు.