ఇప్పటి వరకు గాయకుడిగా అలరించిన రాహుల్సిప్లిగంజ్ రంగమార్తాండ సినిమాతో నటుడిగా మారాడు. రమ్యకృష్ణ, ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రల్లో ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ రంగమార్తాండ సినిమా తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. ఈ మూవీలో రాహుల్సిప్లిగంజ్ కూడా కీలకపాత్రలో కనిపించనున్నాడు. ప్రకాశ్ రాజ్ ఇటీవలే చిత్రయూనిట్కు విందు ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో రమ్యకృష్ణ, కృష్ణవంశీ, రాహుల్ సిప్లిగంజ్, పునర్నవి ఇతర నటీనటులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ సిప్లిగంజ్ “ఏమై పోయావే నీవెంటే నేనుంటే” పాట పాడుతూ పునర్నవితో కలిసి డ్యాన్స్ చేశాడు. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను రాహుల్ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో అంటూ ఫొటోతోపాటు వీడియోను రాహుల్ పోస్ట్ చేయగా… ఇవి సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram
Memorable Evening!😊 @awm_band Thank you so much for being so wonderful. We really enjoyed😊