కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాజీనామాను ఆ పార్టీ వర్కింగ్ కమిటీ తిరస్కరించింది. సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఘోర పరాజయం చవిచూసిన కాంగ్రెస్ పార్టీలోని పలువురు పీసీసీ చీఫ్ లు రాజీనామాలు చేశారు. ఈ క్రమంలో ఢిల్లీలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. రాహుల్ గాంధీ, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పలువురు సీనియర్లు హాజరైన ఈ సమావేశంలో ఓటమికి కారణాలపై చర్చించారు.
ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరవైఫల్యానికి కారణం తనదేనని చెప్పారు. అందుకే అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. అయితే, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ రాహుల్ రాజీనామాను తిరస్కరించింది. పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఒక్క స్థానంలో కూడా గెలువలేదని ఇందుకు తనదే నైతిక బాధ్యత అని రాహుల్ చెప్పినప్పటికీ ఆయన రాజీనామాను ఆమోదించలేదు.
రాష్ట్రంలో దుర్మార్గం రాజ్యమేలుతోంది: లోకేశ్